రెచ్చగోట్టోద్దన్న చైనా

ఉభయ కోరియాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్తితుల్లో ఉ.కోరియాను రెచ్చగోట్టే విధంగా వ్యవహరించటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. విదేశాంగశాఖ ప్రతినిధి హంగ్‌ల్‌ మంగళవారం బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉభయ కోరియాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగోట్టే ఎటువంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దుల మధ్య పరిస్థితి అంశాన్ని ఏఒక్కరూ విస్మరించరాదని ఆయన సూచించారు. ద్వీపకల్పంలో శాంతి,సుస్థిరతలను కోనసాగించేందుకు ఆయన ఉభయ కోరియాలకు సూచించారు.