రెడ్డి సంఘం తరపున ఆర్థిక సాయం

నంగునూరు మండలం ఖాతా గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం రెడ్డి కులానికి చెందిన దారం కృష్ణారెడ్డి మృతి చెందగా ఆ సంఘం తరపున శనివారం రోజున రెడ్డి కులస్థులు సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో మృతుని కుటుంబీకులకు దహన కార్యక్రమాల నిమిత్తం రూ. 5000 అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ దారం జగన్మోహన్ రెడ్డి, సర్పంచ్ చల్లా దశమంత రెడ్డి, సంఘం సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.