రేపు కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం

 

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 26 : మండల పరిధిలోని బీచుపల్లి క్షేత్రం కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో గురువారం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణము జగనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఒక పట్టణంలో తెలిపారు. సీతారాముల కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. అలాగే వివిధ ప్రాంతాలను వచ్చిన భక్తులందరికి పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.