రైతులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవండి.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, ఆగస్టు12, (జనంసాక్షి)
బ్యాంకు అధికారులు రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలకు ఆహ్వానించిన సందర్భంగా అయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకు సేవలు మరింతగా విస్తరించి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవలన్నారు. రైతులకు ప్రత్యేక రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలన్నారు. ఆయన వెంట జడ్పీ వైస్ ఛైర్మన్ తొంగల సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు ఉన్నారు