రైతులకు సోనియా భరోసా

09ecv1lgకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులతో ఆమె మాట్లాడారు. బాధిత రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సోనియా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గత నెల రోజులుగా విదేశాల్లో ఉండటంతో… ఆయన నియోజకవర్గం అమేథీలో కూడా సోనియా పర్యటించారు. త్వరలోనే రాహుల్ నియోజకవర్గానికి వస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు.