రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి చేర్యాల తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా

చేర్యాల (జనంసాక్షి) జూన్ 14 : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఐ రాజేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం చేర్యాల మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం ప్రారంభమైనా రైతుబంధు ఇంతవరకు ఖాతాల్లో జమకాలేదని, నకిలీ విత్తనాలు మార్కెట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, నకిలీ విత్తనాలు అరికట్టి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, రైతు బీమా 70 సంవత్సరాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి చంద్రం, అముదాల నర్సిరెడ్డి, పోలోజు నరసింహ చారి, చందు, మల్లారెడ్డి, కనకయ్య, రైతులు పాల్గొన్నారు.