రైల్వేయార్డులో అగ్నిప్రమాదం

ముంబై,మే29(జ‌నం సాక్షి ): ఛత్రపతి శివాజీ టెర్మినల్‌(సీఎస్‌టీ)లోని రైల్వేయార్డులో అగ్నిప్రమాదం జరిగింది. నిలిపి ఉంచిన రైల్వే బోగీలో మంటలు ఆకస్మాత్తుగా చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేసింది. రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
————–