*రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన శివసేనారెడ్డి*

పెబ్బేరు జూన్ 15 ( జనంసాక్షి ): మంగళవారం రోడ్డు ప్రమాదంలో  గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ లను బుధవారం  రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్య పరిస్థితిని శివసేన రెడ్డి  తెలుసుకుని   కుటుంబ సభ్యులకు యూత్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు.