రోడ్డు ప్రమాదంలో బుధరావుపేట వాసి మృతి

ఖానాపురం సెప్టెంబర్ 10జనం సాక్షి
 మండలంలోని పాకాల వాగు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన నారగోని ప్రశాంత్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే   మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన నారగోని ప్రశాంత్ తన మిత్రులతో కలిసి నర్సంపేట పట్టణం నుండి బుధరావుపేట గ్రామానికి వస్తుండగా పాకాల వంతెనపై  ప్ర‌మాద‌వ‌శాత్తు వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం లారిని ఢీకొన‌గా ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం . క్షత గాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.