రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రావులాపాలెం మండలం ఈతకోట సమీసంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగ్రాతులను సమీప ఆసుపత్రికి తరలించారు.