రోడ్డు వేస్తానన్న హావిూ ఏమయ్యింది

ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఇంటిని ముట్టడిరచిన గ్రామస్థులు

అమరావతి,అగస్టు3(జనం సాక్షి): గ్రామానికి రోడ్డు వేస్తామని హావిూ ఇచ్చి నెరవేర్చ లేదని హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఇంటిని గ్రామస్థులు ముట్టడిరచారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమర్తి మండలం తమ్మినాయనిపల్లి గ్రామానికి రోడ్డు వేస్తామంటూ 8 నెలల కిందట ఎమ్మెల్సీ హావిూ ఇచ్చారని ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన నిర్వహించారు. ఇంట్లో ఎమ్మెల్సీ లేకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. వర్షాకాలంలో రోడ్డు దుస్థితి వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రతీ రాజకీయ నాయకుడికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.