రోడ్ల పై కుక్క ల బెడద

రాజోలి జులై 23 (జనం సాక్షి)
రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్ల పాడు గ్రామంలో
కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడులకు దాడికి బడుతున్నాయి . ప్రజలు కుక్కలను చూసి హడలిపోతున్నారు. బాబోయ్‌ కుక్కలు అంటూ భయపడుతున్నారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉంది. ప్రధాన రోడ్లు గుండా వెళ్తున్న వాహన చోదకులను కుక్కలు వెంబడిస్తున్నాయి. ద్విచక్రవాహన దారులైతే కుక్కల గుంపు ఎదురైనప్పుడు బిక్కుబిక్కుమంటూ మెల్లగా ముందుకు వెళ్తున్నారు. మహిళలు, చిన్నారులపై కుక్కలు తరచూ దాడులకు తెగబడుతున్నాయి. కుక్కల నియంత్రణకు గ్రామ పంచాయతీ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.