లంచం అనే పదం వినిపించొద్దు : పవన్ కళ్యాణ్

లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు. లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.