లండన్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళి

స్వరాష్ట్రం సాధించే వరకూ పోరు కొనసాగాలి
– ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌
లండన్‌, (జనంసాక్షి) : ండన్‌లో ఆదివారం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ శానబోయిన, కోశాధికారి రాజేశ్‌కుమార్‌ స్వదేశానికి తిరిగి వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సెల్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ పెద్దిరాజు నేతృత్వంలో ఈ సందర్భంగా అమరవీరుల ఆత్మశాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ, వేల మైళ్లదూరంలో ఉన్నా తమందరి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధనే అని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది అన్ని రాజకీయ పార్టీల అసలు రంగులు భయటపడుతున్నాయని, ప్రజలు వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీ ఎన్‌ఎఫ్‌ వ్యవస్థపక సభ్యుడు గంప వేణుగోపాల్‌, నాయకులు అశోక్‌, హరి, మల్లారెడ్డి, చందు, అబుజర్‌ మొహ్మద్‌, శ్రవణ్‌, వెంకట్‌రెడ్డి, విక్రం, ప్రవీణ్‌, విష్ణు, శశి, శ్రీకాంత్‌, కిరణ్‌, హరి ఉప్పల, ఉదయ్‌ నాగరాజు, సుధాకర్‌, వంశీ పాల్గొన్నారు.