లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ ల వితరణ ..

మక్తల్ సెప్టెంబర్ 13 (జనంసాక్షి) లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో పట్టణంలోని దయానంద విద్యా మందిర్ కు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను ఉచితంగా అందజేసినట్లు అధ్యక్షుడు సుగురు జైపాల్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా హై స్కూల్ తో పాటు ప్రైమరీ స్కూల్ కు వేల రూపాయల విలువ చేసే రెండు వాటర్ ట్యాంకులను ఉచితంగా అందించామన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ డీవీ చారి, సీనియర్ సభ్యులు బి కొండయ్య, సభ్యులు కర్ని స్వామి, చంద్రకాంత్ గౌడ్, అక్కల సత్యనారాయణ, కట్టా వెంకటేష్ ,సత్యాంజనేయులు, నాగరాజు, పృథ్వీరాజ్ మామిళ్ళ, అంజన్న ప్రసాద్
14వ వార్డు కౌన్సిలర్ కర్ని లక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.