లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

మల్లాపూర్ జనంసా క్షి ఆగస్టు:23 మండల కేంద్రంలో మంగళవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వాసవి మాత మంటపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లాపూర్ లయన్స్ క్లబ్ వారు ప్రజాసేవలో ముందుంటున్నారన్నారు. 150 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన 35 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తము రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాకి పల్లి సరోజన ఆదిరెడ్డి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ రవీందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజా శ్రీనివాస్, శివ శీను గుప్తా, మహమ్మద్ రఫీ,రుద్ర రాంప్రసాద్, డీలర్ మల్లయ్య, రంగు రామాగౌడు, బద్దమనియుడితోపాటు పలువురు పాల్గొన్నారు.