లారీని ఢీకొన్న కారు.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

q85511qcరంగారెడ్డి: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందారు. రజియా సుల్తానా అనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని. రజియాకు ఇటీవలే వివాహం అయింది. భర్తతో కలిసి…గచ్చిబౌలిలో నివాసముంటున్నారు. ఈనేపథ్యంలో రజియా సుల్తానా డ్యూటీ ముగించుకుని.. తన స్వస్థలం బెంగుళూర్ వెళ్లేందుకని.. రాత్రి ఓ క్యాబ్ కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ పై ముందునుంచి వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రజీయా సుల్తానా మృతి చెందారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమ్తితం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. రజియా మరణ వార్త విని ఆమె భర్త కన్నీరుమున్నీరు అయ్యారు.