లారీ-ట్రాక్టర్ ఢీ: 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ట్రాక్టర్ ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.