లింక్‌ తెగి బోగీలను వదిలి వెళ్లిన గూడ్స్‌

కర్నూరు: లింక్‌ తెగిపోవడంతో బోగీలను వదిలిపెట్టి గూడ్స్‌ రైలు వెళ్లిపోయిన ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో చోటుచేసుకువది. కర్నూలు రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం గూడ్స్‌ రైలు లింక్‌ తెలిపోయింది. దీంతో 15 బోగీలు రైలు నుంచి వేరుపడ్డాయి. అయితే ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది డ్రైవర్‌కు సమాచారమందించారు.