లోక కల్యాణానికే శ్రీరామ యజ్ఞాలు…. వెంకటాపూర్ (రామప్ప),జూన్09(జనం సాక్షి):-

లోక కల్యాణం కోసమే గ్రామాల్లో శ్రీరామ యజ్ఞాలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హనుమాన్ ప్రచారకుడు గాదెపాక శ్రీరాములు స్వామి అన్నారు.గురువారం రోజున వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామం లోనీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ
స్వామి ఆలయ ప్రాంగణంలోని హనుమంతుణ్ని ఆయన దర్శించుకొని పూజలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..లోక కల్యాణం కోసం మొత్తం 1008 శ్రీరామ యజ్ఞాలు చేసేందుకు శ్రీకారం చుట్టానన్నారు. మొదటి యజ్ఞం భూపాలపల్లి జిల్లా ఆజాంనగర్లో 2021లో ప్రారంభించామని,ఈ నెల 9న ములుగు జిల్లా నల్లగుంట గ్రామం లో 114వ యజ్ఞం నిర్వహించామన్నారు. 2024లో సీతారాముల కల్యాణం నాటికి యజ్ఞాలు పూర్తి చేస్తామన్నారు.ఏటా జరిగే వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందల చిన్న వెంకట రమణా రెడ్డి,రామగిరి శ్రీనివాస్,పిన్ రెడ్డి సంజీవ రెడ్డి,పెంచాల లక్ష్మీకాంత రంగారావు తదితరులు పాల్గొన్నారు.