వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

మర్పల్లి, సెప్టెంబర్ 12 (జనం సాక్షి) అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీమంత్రి జి. ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం రోజున మర్పల్లి మండలం గుండ్ల మర్పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు కావాలి ఆంజనేయులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగం శివ కుమార్, యం. డి. సలీం, జంగం నర్సింలు, కావాలి సాయులు, బెగారి బలరాజ్ లు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యు. రవీందర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కన్వేయర్ ఎం.ఈశ్వర్, కె.సిద్దయ్య, గొల్ల బీరయ్య, అంబయ్య గౌడ్, గొల్ల రవి గొల్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.