వన మహోత్సవం కింద మొక్కలు నాటారు.

నెరడిగొండ ఆగస్టు10(జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాన్ని
ప్రణాళికాబద్ధంగా బుధవారం రోజున మండల కేంద్రంలో వన మహోత్సవం వేడుకలో బాగంగా  ప్రతి గ్రామ పంచాయతీ మండల పరిధిలో ఫ్రీడం పార్క్ కింద ప్రభుత్వ కార్యాలయాలో ఇతర ఖాళీ స్థలంలో 75 అక్షరం ఆకారంలో మొక్కలను మండల అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రాథోడ్ సజన్ ఎంపీడీఓ అబ్దుల్ సమద్ తహశీల్దార్ పవన్ చంద్ర ఎపిఓ వసంత్ రావు అటవీ శాఖ అధికారులు సంబంధిత వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు పెంట వెంకట రమణ సోలంకి గీత కరన్ సింగ్ పార్టీ నాయకులు శివారెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.