వరంగల్‌లో వర్షాలకు కూలిన పాతభవనం

ప్రమాదంలో యువకుడు మృతి

వరంగల్‌,జూలై23(జనంసాక్షి): వరంగల్‌ నరగంలోని మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో అందులో ఉన్న 60 ఏండ్ల వృద్ధుడు పైడి, ఫిరోజ్‌ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. సమ్మక్క అనే మహిళ తీవ్రంగా గాయపడిరది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు. చనిపోయిన ఫిరోజ్‌కు నేడు నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.