వరంగల్ బట్టల బజార్ లో ట్రాఫిక్ అవగాహన

వరంగల్ ఈస్ట్, జూన్ 7(జనం సాక్షి):
వరంగల్ మహా నగరంలోని తూర్పు నియోజకవర్గం బట్టల బజార్ లో వరంగల్ సీపీ తరుణ్ జోషి, డిసిపి పుష్ప రెడ్డిల ఆదేశానుసారం మంగళవారం వరంగల్ ట్రాఫిక్ సీఐ బాబూలాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఆటో డ్రైవర్లు ,తోపుడుబండ్ల యజమానులకు ట్రాఫిక్ అంతరాయం గురించి వివరించారు .నిత్యం రద్దీగా ఉండే బట్టల బజార్ ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా అందరు సహకరించాలని కోరారు.  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామారావు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.