వసతులతో కూడిన క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడ మైదానాలలో క్రీడాకారులకు వసతులను ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామ సమీపంలో నిర్మించిన క్రీడ మైదానాన్ని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడా మైదానాలలో ఎలాంటి వసతులు కల్పించకుండా క్రీడాకారులను ఏవిధంగా ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గ్రామ స్థాయి క్రీడా మైదానాలలో వసతులను కల్పించి క్రీడాకారులను ఉత్తేజపరచాలన్నారు. అదేవిధంగా క్రీడ మైదానంలో డంపింగ్ యార్డ్, విద్యుత్ మోటర్, స్మశాన వాటికలను ఏర్పాటు చేయడం ఫై క్రీడాకారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల కన్వీనర్ తిరుపాలు, నాయకులు ఆకేపొగు బీసన్న , ఆకే పోగు రాంబాబు తదితరులు పాల్గొన్నారు