వామపక్షాల సమావేశం: రాష్ట్రబంద్‌పై చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్ష పార్టీలు ఈ రోజు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ఈ నెల 9న జరప తలపెట్టిన రాష్ట్రబంద్‌పై చర్చిస్తున్నారు. రాష్ట్రబంద్‌తో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దేశంలో బొగ్గు మాఫియా వల్లే విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.