వాలంటరీ ఆర్గనైజేషన్ అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

:డిఎస్పి మెట్ల వెంకటరమణ
జూలై 24 జనం సాక్షి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ మెయింటెనెన్స్ తో అందిస్తున్న అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ మొట్ల వెంకటరమణ అన్నారు. ఆదివారం అంబులెన్స్ వాల్ స్టిక్కర్లను సంస్థ ఫౌండర్ సిరికొండ విక్రమ్ కుమార్,సంస్ధ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 7 సంవత్సరాలుగా మథర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. సంస్థ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా తొర్రూరు మండల పరిధిలో నిరుపేదలకు ఎమర్జెన్సీ సర్వీస్ అందించేందుకు సంకల్పించి దాతల సహకారంతో అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకురావడం, పెట్రోల్ మెయింటెనెన్స్ తో సర్వీసు అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.