అమెరికాలో జడ్జిగా ప్రవాస భారతీయుడు!

వాషింగ్టన్‌; ఛండీగఢ్‌లో జన్మించిన ప్రవాస భారతీయుడు శ్రీకాంత్‌ శ్రీనివాస్‌ అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపిక కానున్నారు.దేశంలోనే రెండవ అత్యున్నత కోర్టుగా వ్యవహరించే వాషింగ్టన్‌లోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ న్యాయమూర్తిగా ఆయన ఎన్నికైతే, ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియావాసిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం యూఎస్‌ ప్రిన్సిపాల్‌ డిప్యూటీ సొలిసిటార్‌ జనరల్‌గా శ్రీకాంత్‌ వ్యవహరిస్తున్నారు.