విచారణ పేరుతో సోనియా గాంధీని ఈడీ వేధించడం పట్ల డిసిసి అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు.

 అచ్చంపేట ఆర్సి 27 జూలై జనం సాక్షి న్యూస్ :-దేశం కోసం  ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఈడీ విచారణ పేరుతో సోనియాగాంధీ పైన  వేధింపులకు దిగడం మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ డిమాండ్ చేశారు . కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన ఆరోపణల్లో వాస్తవం లేదని  దీనిపై 2015లో సుప్రీంకోర్టు కేసులు కొట్టివేసింది అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక సోనియాగాంధీ ని  అప్రతిష్ట పాలు చేసేలా మరోవైపు  ఈడిని అడ్డం పెట్టుకొని మోడీ ప్రభుత్వం వేధింపులకు దిగుతున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి కార్యకర్తల నుండి  ఈ డి  వేధింపులకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు .సోనియా గాంధీ రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న పదవుల ను  తృణప్రాయంగా  వదులుకున్నారు అన్నారు.కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.కార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area