విజయబేరి సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. – బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్.

బెల్లంపల్లి, నవంబర్ 13, (జనంసాక్షి )
అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బెల్లంపల్లి పట్టణంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హజరైన విజయబేరి బహిరంగ సభకు బారీగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయబేరి బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి అంచనాలకు మించి ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ఎంతో కష్టపడి సభకు తరలివచ్చారని, ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా పార్టీపై అభిమానంతో, దూరప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఒక్కో వాహనంలో మోతాదుకు మించి రావడం శుభపరిణామమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి విజయబేరి సభ విజయవంతంలో బాగస్వాములయ్యారని ఆయన కొనియాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభకు బారీగా తరలి రావడం, ప్రజలను సమీకరణకు కృషి చేసిన పార్టీశ్రేణులను ఆయన అభినందిస్తూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.