విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

ఇల్లందు సీఐ కరుణాకర్ వెల్లడి.

ఇల్లందు డిసెంబర్ 2 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఇల్లెందు సీఐ కరుణాకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ లో భాగంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున, గుంపులు, గుంపులుగా జనం ఉండవద్దని సూచించారు. ముఖ్యంగా బాణాసంచా కాల్చవద్దని, ఓడిన వారిని ఎగతాళి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కు సహకరించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.