విదేశీ విద్యాపథకానికి గండి: అశోక్‌బాబు

అమరావతి,జూలై14(జనం సాక్షి): షరతులతో విదేశీ విద్యా పథకాన్ని చేపట్టడం మోసగించడమే అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… టీడీపీహయాంలో 4,900 మందికి విదేశీ విద్య కల్పించామని తెలిపారు. తమ జీవోతో 100 మంది కూడా ఉచితంగా విదేశాల్లో చదవలేరని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే గతంలో అమలైన విధంగా విదేశీ విద్యను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. జీవో 39ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు.