విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

మోత్కూర్ జూలై   జనంసాక్షి : మండలంలోని పాలడుగు గ్రామ పంచాయతీ కో- ఆప్షన్ సభ్యులు రిటైర్డ్ విధ్యాధికారి బద్ధం యాదిరెడ్డి సుజాత వారి కుమారుడు పిర్జాధిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు. తమ సొంత గ్రామమైన పాలడుగు లో బుధవారం 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ఒక్కొక్కరికి తరగతుల వారీగా 6-8 నోటు బుక్కులను తమ తల్లిదండ్రుల చేత పంపిణీ చేపించారు. ఈ విద్యా సంవత్సరం మేయర్ జక్క వెంకట్ రెడ్డి తన స్వంతంగా దాదాపు 3 లక్షల రూపాయలను పాఠశాలకు సమకూర్చడం జరిగినది. ఈ సందర్భంగా మేయర్ జాక్క వెంకట్ రెడ్డి కి పాటశాల తరపున ఉపాద్యాయులు, విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రిపెల్లి యాదయ్య,ప్రధానోపాధ్యాయులు గడిగల మురళీధర్,స్కూల్ చైర్మన్ మిడిదొడ్డి,మల్లేష్,ఉపాద్యాయులు బత్తిని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.