విద్యార్థులకు చరిత్ర పట్ల అవగాహన పెంపొందించాలి. ప్రిన్సిపాల్ సాబేర ఖాతున్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మంగళ వారం చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ హెచ్.ఇ.సి. కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన వాల్ పోస్టరును జిల్లా ప్రిన్సిపాల్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సబేర ఖాతాన్ మాట్లాడుతూ చరిత్ర సబ్జెక్టు కేవలం హెచ్.ఇ.సి. చదివే విద్యార్థులకే పరిమితం చేయకుండా ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సుల చదివే విద్యార్థులకు భోధీస్తే దేశ చరిత్రతో పాటు తెలంగాణ చరిత్ర సంస్కృతి పట్ల సరైన అవగాహన పెంపొందుతుందన్నారు. అలాగే ఇంటర్ విద్యాబోధనలో చరిత్ర సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన విద్యార్థులలో మానవీయ, నైతిక విలువలు పెంపొందడంతో పాటు పోటీ పరీక్షల కోసం తర్ఫిదం పొందుతారని పేర్కొన్నారు. ఇంటర్ విద్య వ్యవస్థలో పనిచేస్తున్న చరిత్ర జూనియర్ లెక్చరర్లు సమాజంకు ఉపయోగపడే సబ్జెక్టు చరిత్ర పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిటెంట్ గోవర్ధన్ రావ్,చరిత్ర అధ్యాపకులు కె కృష్ణయ్య, మరియు,ఇతర అధ్యాపకులు శోభ రాణి,శ్రీను తదితరులు
పాల్గొన్నారు.