విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించండి…

-మల్లాపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన…
-జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య…
 గద్వాల రూరల్ జూన్ 23 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య సందర్శించారు…పలు కార్యక్రమాలకు వెళ్లి వస్తుండగా చెట్ల కింద విద్యార్థులు కూర్చుని ఉన్న దృష్యాం చూసిన జెడ్పి చైర్ పర్సన్ అక్కడ విద్యార్థులతో మాట్లాడి,అడిగి తెలుసుకున్నారు, పాఠశాల భవనం మరమ్మత్తుల నిమిత్తం చెట్ల క్రింద చదుకుంటున్నాట్లు విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు. అక్కడ విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఆత్మీయంగా మాట్లాడుతూ మీకు ఉపాధ్యాయులు చదువు బాగా చెప్పుతున్నారా..?అని…అడిగారు..విద్యార్థులకు  అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు విద్య ఎలా‌ బోధిస్తారని,మధ్యాహ్న‌ భోజనం నాణ్యమైన భోజనం పెడుతున్నార లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు…ఉపాధ్యాయులతో జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు…ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు