విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం

రాజోలి 13 సెప్టెంబర్(జనం సాక్షి) మండల కేంద్రమైన రాజోలిలోని జిల్లా పరిషత్ పాఠశాల లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక జై శ్రీరామ్ సేవసమితి సభ్యులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు తో కలిసి ప్రదానోపాధ్యాయురాలు నిర్మల జ్యోతి కి వినతి పత్రాన్ని అందించారు. పాఠశాలలో మూత్రశాలలు,మరుగుదొడ్లు లేవని, గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో చెట్ల కిందనే విద్యార్థులు కూర్చునే పరిస్థితి నెలకొంది అని అన్నారు.తాగునీరు కూడా లేకపోవటం, మధ్యాహ్న భోజనం సమయంలో పందులు ఎక్కువగా సంచరిస్తున్నాయని వీటిపై చర్యలు చేపట్టాలని కోరారు