విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ..

కామారెడ్డి ఆగస్ట్8(జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదురుగా విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నందున నిరసనగా చేపట్టిన దీక్షా శిబిరానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి  దాత్రిక సత్యం , గొనె శ్రీనివాస్ నియోజకవర్గం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేణి సందీప్, మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్ నాయక్, శివాయి పల్లి శ్రీనివాస్ రెడ్డి,విద్యుత్ శాఖ జేఏసీ నాయకులు బి బ్రహ్మం, చైర్మన్ , వై సంపత్ రెడ్డి కన్వినర్, గౌస్ కోకన్వీనర్, ఎస్ ఏ ఓ శ్రీనివాస్, డి ఈ ఈ అన్ని విభాగల ఉద్యోగస్తులు  పాల్గొన్నారు.