వినాయక నిమజ్జనంలో హబ్సిగూడ యువకుడు మృతి

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 12 వినాయక నిమజ్జనంలో యువకుడు మృతి చెందిన సంఘటన బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది తీరాన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై గోకారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలోని హబ్సిగూడ కాలనికి చెందిన కృష్ణ స్నేహితులతో కలిసి వినాయకుని నిమజ్జనం చేసేందుకు సుమారుగా 15 మంది యువకులు నిమజ్జనం చేసేందుకు ఆదివారం రాత్రి బీచుపల్లి చేరుకున్నారు. సోమవారం ఉదయం వినాయకుని నిమజ్జనం చేసిన అనంతరం స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి వెళ్లగా తనకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలోపడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. గమనించి తోటి స్నేహితులు కేకలు వేస్తూ రక్షించమని కోరగా గజ ఈతగల సాయంతో వెతికినప్పటికీ యువకుడు కృష్ణ వయస్సు (18) నదిలోని మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతి చెందిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.