వినాయక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి)
యాచారం మండలం మల్కీజ్ గూడా గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా  దుర్గాభవాని వడ్డెర సొసైటీ భవనం వద్ద ప్రతిష్టింపబడిన వినాయకుడి కి  కుటుంభ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యాచారం మండల ప్రధాన కార్యదర్శి వరికుప్పల సుధాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయుఆరోగ్యాలతో  ఉండాలని , రైతులకు పంటలు బాగా పండి మంచి దిగుబడిని పొందాలని  విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉద్యోగం పొందాలని
నిరుద్యోగ సోదర సోదరీమణులు మంచి ఉద్యోగాలు సాధించాలని , వ్యాపారస్తుల వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలని , అందరూ బాగుండాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దుర్గాభవాని వడ్డెర గణపతి కమిటీ సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు