విపక్షనేతలో స్పీకర్‌ ఓం బిర్లా భేటీ

సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని వినతి

న్యూఢల్లీి,జూలై16(జనం సాక్షి ): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని పార్టీల లోక్‌ సభ పక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సభా మర్యాదలు కాపాడాలని లోకసభా పక్ష నేతలను స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. మరోవైపు ఆదివారం సాయంత్రం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అన్ని పక్షాల నేతలతో వెంకయ్య నాయుడు భేటీ కానున్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరనున్నారు.