విమర్శలతో ఎదురుదాడి చేయడం కాదు

విభజన హావిూలను అమలు చేయాలి
కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌
అమరావతి,మే24 (జ‌నంసాక్షి): విభజన సందర్భంగా ఆనాటి హావిూలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీపైన ఉందని కాంగ్రెస్‌ వ్యాఖ్యనించింది. ఆనాటి హావిూలను అమలు చేసి నిబద్దత నిరూపించుకోవాలని ఎపి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అన్నారు. వీటిని పక్కదాని పట్టించేలా ఎనిమిదేళ్లు గడిపారని అన్నారు. అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ పదేళ్లు ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. అయితే… 14వ ఆర్థిక సంఘం సిఫారసులను నెపంగా చూపించి హోదా ఇవ్వలేమని ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈ వాగ్దానాన్ని కేంద్రం ఉల్లంఘించిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. నిజానికి రాష్ట్ర విభజనను సీమాంధ్రులు కోరుకోలేదని అన్నారు. తమకు జరిగిన నష్టం పట్ల ప్రజలు ఎంతో భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. తమను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని వారు భావిస్తున్నారని తెలిపారు. అప్పటి ప్రధాన మంత్రి ఇచ్చిన హావిూలకు, కాగ్‌ నివేదికలకు, సుప్రీం కోర్టు సలహాలకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని,విమర్శలతో ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున… భూసేకరణ, పునరావాసం నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుపై రాష్ట్రం పెట్టిన ఖర్చును వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు. రాజధాని ప్రాంతంలోని 27 వేల మంది రైతులు రూ. 50 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన భూమిని సవిూకరణలో అప్పజెప్పగా… కేంద్రం రూ.1500 కోట్లతో సరిపెట్టిందని నిరసించారు. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే
విషయంలోనూ కేంద్రం ఏపీ పట్ల వివక్ష చూపిందని విమర్శించారు. ఇవనీ ప్రశ్నిస్తే వాటికి సమాధానం ఇవ్వకుండా బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమని అన్నారు. రైల్వే జోన్‌, పెట్రో కెమికల్‌
కాంప్లెక్స్‌, ఏపీ శాసన సభా సీట్ల పెంపు, పన్ను వ్యత్యాసాల సవరణ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, వైజాగ్‌ ` చెన్నై పారిశ్రామిక సమాహారం, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, దుగరాజుపట్నం రేవు, అమరావతికి ర్యాపిడ్‌ రైలు రహదారి అనుసంధానం, గ్రేహౌండ్‌ శిక్షణా కేంద్రం మొదలైన అంశాలు నాలుగేళ్లుగా పెండిరగ్‌లో ఉన్నాయని అన్నారు. వీటిని అమలు చేయరా అని తులసిరెడ్డి ప్రశ్నించారు.