విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?

విశాఖపట్నం (జనం సాక్షి)

విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది.

అయితే అటువంటి సమాచారం తమకు అందలేదని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు నడుస్తోంది. ఈ రైలులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే రద్దు చేయాల్సి వస్తోంది. తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మరో పక్క దీన్ని విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.