విశాఖ, విజయవాడల్లో మంచి మెట్రోప్రాజెక్టును తీసుకువస్తాం- చంద్రబాబు

ఢిల్లీ, మార్చి 28 : విశాఖ, విజయవాడ నగరాల్లో మంచి మెట్రో ప్రాజెక్టులను తీసుకువస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ మెట్రోరైలులో ప్రయాణించిన సీఎం అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఎప్పటినుంచో ఢిల్లీ మెట్రోను చూడాలనుకున్నానని అంటూ మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉందన్నారు. మెట్రోరైళ్లతో సమయం ఆదా అవటంతోపాటు కాలుష్యం సమస్య ఉండదన్నారు. దేశంలో అధిక జనాభా ఉన్న దృష్ట్యా మరిన్ని మెట్రోరైలు ప్రాజెక్టులు రావాలన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో మెట్రోరైళ్లను పరిశీలిస్తామన్నారు. ఢిల్లీ మెట్రోరైలును కూడా మరోసారి పరిశీలిస్తానని చంద్రబాబు వివరించారు.