**వి ఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి **

శ్రీరంగాపురం: జూలై 28 (జనంసాక్షి)

వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని శ్రీరంగాపురం జడ్పిటిసి మరియు టిపిసిసి బీసీ విభాగం ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో వి ఆర్ ఏలు చేపట్టిన నిరధిక సమ్మెకు  మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన వి ఆర్ ఏ హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలను వెంటనే  పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంబాలపురం ఎంపిటిసి ఎల్ల స్వామి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాములు యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు మరి కాంగ్రెస్ నాయకులు.
వీఆర్ఏల సంఘం అధ్యక్షులు ఎస్ రాములు ఉపాధ్యక్షులు నరసింహ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, రామేశ్వరమ్మ,శివమ్మ, స్వామి సభ్యులు పాల్గొన్నారు