వీఆర్ఏల సమస్యలను పరిష్కరించేవరకు పోరాడుతాం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 28 :
వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాడుతామని వీఆర్ఏల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో చేపట్టిన వీఆర్ఏల నిరవధిక సమ్మె 35వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేసి అర్హులైన వారికి పదవన్నతలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏలు నాగేష్, మహేష్, బీసన్న, నాగేష్ నాయుడు పాల్గొన్నారు.