వీర్నపల్లిలో కాళోజీ జయంతి చేసిన విఆర్ఎలు

 

వీర్నపల్లి, సెప్టెంబర్ 09 (జనంసాక్షి): తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు విఆర్ఎలు 47వ రోజు నిరవధిక సమ్మె చేస్తూ కాళోజీ నారాయణరావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కారించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల సంఘం మండల అధ్యక్షుడు గంగధరి నాంపెల్లి, లంక దేవేంద్ర, లక్ష్మిరాజం, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.