:-వెంకటేష్,(మద్దూర్ మండలం)

*ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు*
============================
మద్దూర్ (జనంసాక్షి):- నారాయణపేట జిల్లా
మద్దూరు మండల పరిధిలోని నిడ్జింత గ్రామ శివారులో వెలసిన  శ్రీ వెంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాలు శనివారాం రోజు అంగరంగా వైభవంగా నిర్వహించారు.
శనివారం తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవతో ప్రారంభమై జల్దీ బిందెతో పాటు బాజా భజంత్రీలతో పల్లకి సేవ లో నిర్వహించారు. భక్తుల కోరిక తీర్చే ఇలావేల్పుగా గుర్తింపు పొందిన స్వామివారి వేడుకలను ప్రతి ఏటా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని ఆలయ పూజారి తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల నుండి  శ్రావణ మాసం ముగింపు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.
శనివారం,ఆదివారం ఈ రెండు రోజుల పాటు జరుగుతున్న జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టపై భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.