*వేములకొండను మండలం గా చేయాలని భారీ ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకులు*

 జనం సాక్షి న్యూస్ ఆగస్టు 29  వలిగొండ  మండల పరిధిలోని వేములకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద గత 36 రోజుల గా వేములకొండను మండల గా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్షలు చేపట్టిన వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు గ్రామస్తులు నేడు మండల కేంద్రం లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి భారీ ర్యాలీతో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. వేములకొండ, వెంకటాపురం,గోపరాజు పల్లి, గుర్నాథ్ పెళ్లి, ముద్దపురం, చిత్తాపురం,దుప్పల్లి, నర్సాపురం గ్రామాలను కలిపి వేములకొండ మండలం ప్రకటించాలని అఖిలపక్ష  ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వేములకొండను మండలం గా ఏర్పాటు చేస్తే అన్ని గ్రామాల ప్రజలకు రావన సౌకర్యానికి అనుకూలంగా ఉంటుందని, వేములకొండ మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మండల సాధన సమితి చేపట్టిన అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులు.మండలం ఏర్పాటు చేయాలనే,బలమైన ఆకాంక్షతో  నాయకులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకుల తో పాటు మహిళలు,విద్యార్థులు, మరియు గ్రామస్తులు రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారీ ఎత్తున ర్యాలీ తీశారు అనంతరం భువనగిరి నల్గొండ వెళ్లే రహదారిపై రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల పూర్వ అధ్యక్షులు సామరాంరెడ్డి సర్పంచ్డ గ లక్ష్మమ్మ బాలయ్య. రాజగోలి శోభారాణి వెంకటయ్య కీసరి ఉపేంద్ర సత్తిరెడ్డి ఉప్పల్ రెడ్డి బోడ సుదర్శన్ కొత్త రామ్ చంద్రు కొత్త వెంకట కొత్త నరసింహ తదితరులు పాల్గొన్నారు