వైకాపా మూకలు పద్దతి మార్చుకోవాలి

హత్యలతో టిడిపిని బెదరించలేరు
శ్రీనివాసులు హత్యపై ఘాటుగా స్పందించిన లోకేశ్‌
అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెదేపా నేత, మాజీ మాజీ సర్పంచి వాకిటి శ్రీనివాసులును వైకాపా మూకలు దారుణంగా హత్య చేశాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ’ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ఎన్నికల్లో తెదేపా తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైన జగన్‌ అండ్‌ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించకూడదన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా
ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైకాపా మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెదేపా అండగా నిలుస్తుందని నారా లోకేశ్‌ హావిూ ఇచ్చారు. తెదేపా నేత శ్రీనివాసులు హత్యను పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండిరచారు. హోసూరులో తెదేపాకు భారీ మెజారిటీ రావడంలో శ్రీనివాసులుది కీలకపాత్ర అని పేర్కొన్నారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.