వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన సుష్మ కుటుంబ సభ్యులను జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం సుష్మ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి  లింగంపల్లి గ్రామానికి విచ్చేసి పార్థివ దేహం పై పూలమాలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి  20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయక మహిళల ప్రాణాలను తీసిన డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు, అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో లింగంపల్లి ఎంపీటీసీ జయానందం, సర్పంచ్ వినోద మూర్తి , ఉప సర్పంచ్ స్వాతి విష్ణు, ఎం ఎన్ ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ఐలయ్య ,కరుణాకర్ రెడ్డి,ప్రవీణ్,కృష్ణ,వెంకటేష్,బుర శివ, కిష్టయ్య, మరియు  వివిధ పార్టీల నాయకులు కిషన్ రెడ్డి,శ్రీనివాస్,మహేందర్, గ్రామ ప్రజలు ,బంధుమిత్రులు తదితరులు ఉన్నారు.